Join Dafanews today and get to enjoy our Free to Play Games.
Join Dafanews

Welcome, !

You have successfully created your account. You can now enjoy our FREE TO PLAY GAMES

Play Now Play Now

Welcome, !

You have successfully created your account. You can now enjoy our FREE TO PLAY GAMES or access our wide range of DAFABET products

Can't Login?

Stay in Loop!

Join our Telegram community for the latest sports news, highlights, live scores, and more.


వ్రాసిన వారు Website Admin
సంక్షిప్తం, క్రూరం మరియు ఇంకేమాత్రమూ తోటి పెళ్ళికూతురు కాదు: పివి సింధు అంతిమంగా ఒక ప్రపంచ ఛాంపియన్

సంక్షిప్తం, క్రూరం మరియు ఇంకేమాత్రమూ తోటి పెళ్ళికూతురు కాదు: పివి సింధు అంతిమంగా ఒక ప్రపంచ ఛాంపియన్

January 31, 2020

38 నిముషాల పాటు ఏక పక్షంగా సాగిన ఆధిపత్య ప్రదర్శన తర్వాత, భారత ఏస్ షట్లర్ పివి సింధు ఛాంపియన్‌షిప్ పాయింటును సాధించింది. ఆమె మరొక విధ్వంసాన్ని ఆవిష్కరించింది, అందులో జరిగిన ఖండనల పరంపరలో జపాన్ కు చెందిన నోజుకి ఒకుహరా కు

జవాబులే లేకపోయాయి, తద్వారా ఆమె తన పేరును భారతీయ క్రీడా చరిత్రలో లిఖించుకొంది. బాసెల్ లో జరిగిన బి.డబ్ల్యు.ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ లో బంగారు పతకం గెలుపొందడం ద్వారా ఇంతవరకూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏ పురుషుడూ లేదా ఏ మహిళా సాధించని విజయాన్ని ఆమె స్వంతం చేసుకొంది. పివి సింధు ఇప్పుడే ఒక ప్రపంచ ఛాంపియన్ అయింది. మరి అది సులభంగానైతే రాలేదు.

2010 లో మొదలయినప్పటి నుండీ సింధు ఎల్లప్పుడూ ఉపమానపూర్వక తోటి పెళ్ళికూతురుగా ఉంటోంది. ఈ దశాబ్దం తొలి సంవత్సరాలలో ఆధిపత్యం వహించిన సైనా నెహ్వాల్ వార్తలను ఆమె ఎంతో ఆసక్తిగా చూసింది మరియు మాజీ ప్రపంచ నంబర్ వన్ కు దీటైన ఆటతీరును ప్రదర్శించసాగింది. ఆమె చివరికి 2013 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ లో తన మార్కును ప్రదర్శించింది, అక్కడ అప్పటి ఈ 18 ఏళ్ళ అమ్మాయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకొంది మరియు ఆ ఈవెంటులో ఆమె భారతదేశపు ఏకైక పతకవిజేత. తర్వాతి ఆరుసార్లుగా, సింధు ఒక్కరొక్కరిగా ఛాంపియన్ తర్వాత ఛాంపియన్ ని ఓడించుకుంటూ బలం పుంజుకొంది మరియు ప్రపంచం యొక్క అత్యుత్తమ బ్యాడ్‌మింటన్ క్రీడాకారుల్లో ఒకరిగా తన ప్రతిష్టను పెంచుకొంది.

అయితే, అదృష్టం ఉండి ఉంటే, సింధు ఆ ఫైనల్ అడ్డంకిని అధిగమించడానికి శ్రమించాల్సి ఉండింది. 2014 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ లో ఆమె తన కాంస్య పతక పనితీరును పునరావృతం చేసింది, ఆసియా క్రీడల్లో, కామన్‌వెల్త్ క్రీడల్లో అదే విధంగా ఆ సంవత్సరమే ఆసియా ఛాంపియన్‌షిప్స్ లో సైతమూ మూడో-స్థానం ముగింపుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమె ఎట్టకేలకు 2016 రియో ఒలంపిక్స్ లో సెమీ-ఫైనల్ గండం గట్టెక్కింది మరియు మొదటి సెట్ లో ప్రపంచ నంబర్ 1 కరోలినా మారిన్ పై నువ్వా-నేనా అన్న రీతిలో పోరాడి దానిని 21-19 తో గెలుచుకుంది. ఆటలలో వ్యక్తిగత
బంగారు పతకాల కొరకు ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో ఉత్కంఠగా ఉంటుంది, సింధు సజీవ ఆశల ద్వారాల వద్ద నిలిచింది. ఐతే ఈ హైదరాబాదీ అమ్మాయికి ఆ క్షణం మరీ పెద్దదిగా అనిపించింది. పొరపాట్లు అల్లుకుపోయాయి, ఆమె స్పానిష్ ప్రత్యర్థి ఆటలో దూసుకెళ్ళింది మరియు భారత ఆశాకిరణాన్ని మూడు సెట్లలోనూ ఓడించి తన దేశానికి బంగారు పతకం సాధించుకొంది.

నాంజింగ్ లో జరిగిన 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ లో మారిన్, ఫైనల్ లో సింధూను నేరు సెట్లలో ఓడించి తన మూడో ప్రపంచ ఛాంపియన్‌షిప్ కిరీటాన్ని స్వంతం చేసుకొని సింధూకు మరింతగా గుండెకోతను మిగిల్చింది. ఒక ఎసిఎల్ గాయం స్పానియార్డ్ ను 2019 ఎడిషన్ కు దూరం చేసింది, దానితో, చివరికి ఊరిస్తున్న కిరీటాన్ని స్వంతం చేసుకోవడానికి సింధుకు మార్గం సుగమమైంది. తొలి రౌండ్లలో ఆమె బాగానే దూసుకెళ్ళింది, ప్రపంచ నం.2 తై త్జు-యింగ్ ను ఎదుర్కోవడానికి ముందు తన ప్రత్యర్థులను తేలిగ్గానే ఓడించింది, అలాగే ఆమెయొక్క మూడవ సూటి బి.డబ్ల్యు.ఎఫ్ ప్రపంచ
ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరుకోవడానికి చిరస్మరణీయ మూడు సెట్లలో ఆమెను ఓడించింది. ఐతే ప్రదర్శనాత్మక ఫైనల్ లో ఒక సుపరిచిత శతృవు సింధూను వెంటాడింది.

2017 ఎడిషన్ లో, ప్రస్తుత ప్రపంచ నం. 3 నోజోమీ ఒకుహరపై దానిని సింధూ, తన మొదటి బి.డబ్ల్యు.ఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్ గా చేసుకొంది. అప్పటి 22-సంవత్సరాల-అగ్నికణం సింధూ మరియు జపాన్ కు చెందిన అమ్మాయి, ఈవెంటు యొక్క చరిత్రలో అత్యుత్తమమైన ఒక ఫైనల్స్ ఆడారు, అందులో ఒక టైటానిక్ పోరు తర్వాత ఈ ఇండియన్ ఏస్ 19-21, 22-20, 20-22 తో ఓటమిపాలైంది. గడచిన ఆరు సంవత్సరాలుగా, పి.వి సింధు గురించిన అత్యంత తాజా వార్తలు ఆట యొక్క ఘనతల్లో ఒకదానిని వికసింపజేశాయి. ఐతే, మిగతా వాటికి వలెనే, ఆమె
ఇంకా అతి పెద్ద ఆటను అధిగమించాల్సి ఉంది. ఈ క్రీడలో అతిపెద్ద పేరున్న వాళ్ళపై అతి పెద్ద ఫైనల్ మరి. ఆదివారం రోజున, తన ప్రతిష్టను పటిష్టపరచుకోవడానికి ఆమె మరొక అవకాశం సంపాదించుకొంది. కేవలం 40 నిముషాల కంటే తక్కువ సేపు జరిగిన ఒక విధ్వంసక పోరులో, సింధూ శిఖరాగ్రాన్ని చేరుకొంది.

ఈ 24-ఏళ్ళ అమ్మాయి పట్ల ప్రశంసల జల్లు కురుస్తుండగా తన మెడ చుట్టూ మురిసిన బంగారు పతకంతో ఆమె పోడియం అగ్రభాగాన నిలిచింది. మరి రాబోవు రోజుల్లో ఆమె అభినందనలలో మునిగి తేలుతుండగా, తన సాంత్వనకు మించి మరేదీ ఆమెకు రుచించబోదు. మరిన్ని ఇటీవలి బ్యాడ్‌మింటన్ వార్తలు చదవండి.
రచన:క్రీడా ముఖాముఖీ

రచయిత గురుంచి


వ్రాసిన వారు Website Admin

×
Embed Code