Join Dafanews today and get to enjoy our Free to Play Games.
Join Dafanews

Welcome, !

You have successfully created your account. You can now enjoy our FREE TO PLAY GAMES

Play Now Play Now

Welcome, !

You have successfully created your account. You can now enjoy our FREE TO PLAY GAMES or access our wide range of DAFABET products

Can't Login?

Stay in Loop!

Join our Telegram community for the latest sports news, highlights, live scores, and more.


వ్రాసిన వారు Website Admin
సుదీర్మన్ కప్ 2019:పోరాడుతున్న భారతీయ అనిశ్చితికి ఒక కఠిన పరీక్ష

సుదీర్మన్ కప్ 2019:పోరాడుతున్న భారతీయ అనిశ్చితికి ఒక కఠిన పరీక్ష

January 31, 2020

మనం వేసవి కాలం యొక్క ఉధృతికి చేరుకుంటున్న కొద్దీ, అందరి కళ్ళూ చైనా లోని న్యానింగ్ పైనే ఉంటాయి, ఎందుకంటే అక్కడ జరిగే ప్రతిష్టాత్మక సుదీర్మన్ కప్ 2019 లో భారత బ్యాడ్‌మింటన్ జట్టు పాల్గొనబోతోంది. మే 19 నుండి 26 వరకూ, ఆసియా ఖండములో

అత్యుత్తమ బ్యాడ్‌మింటన్ దేశముగా అవతరించడానికై ఒక బిడ్ లో ఇండియా యొక్క అత్యుత్తమ ఆటగాళ్ళు కొందరు ఆసియాకు చెందిన శక్తిశాలులతో పోటీపడబోతున్నారు. ఐతే సరైన ఫామ్ లో లేనట్లుగా బ్యాడ్‌మింటన్ వార్తలలో నిలుస్తూ వస్తున్న కొందరు అథ్లెట్లు, ఇండియా యొక్క ప్రముఖ ముఖాలు, మరి చైనాలో రాణించగలుగుతారా?

ప్రారంభకులకు, ఇండియా యొక్క ఉత్తమ మహిళా షట్లర్లు – సైనా నెహ్వాల్ మరియు పి.వి సింధుకు ఇంతవరకూ ఫలప్రదమైన సీజనులు దక్కలేదు. ఇటీవలనే ముగిసిన న్యూజిలాండ్ ఓపెన్ లో, సైనా మొదటి రౌండులోనే ప్రపంచ నంబర్ 212 వాంగ్ ఝీ యీ చేతిలో ఓటమి పాలయింది.

ఏప్రిల్ లో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్స్ లో, సింధు మరియు సైనా ఇద్దరూ క్వార్టర్ ఫైనల్స్ కు ముందుగానే నిష్క్రమించారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఈ ఇద్దరు క్రీడాకారిణులు భారత్ యొక్క అత్యంత అలంకృత క్రీడాకారిణులుగా ఉండగా, వాళ్ళు మహిళల సింగిల్స్ విభాగములో ఆటలో నిజంగానే ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది.(మరిన్ని సైనా నెహ్వాల్ అత్యంత తాజా వార్తల కొరకు)

అశ్వినీ పొన్నప్ప-సిక్కి రెడ్డి మరియు పూర్విషా ఎస్.రామ్ – జె. మేఘన మహిళల డబుల్స్ జట్టుగా ఉంటారు. ఈ జోడీ వాళ్ళ వైపు నుండి అనుభవం కలిగి ఉన్నారు, ఐతే వాళ్ళు బలమైన సవాలును మోయగలిగి మరియు తమ జట్టును విజయం వైపు నడిపించగలుగుతారా అనే దానిని వేచి చూడాల్సి ఉంది.

పురుషుల వైపు నుండి, ప్రపంచ నంబర్ ఎనిమిది కిదాంబి శ్రీకాంత్ సింగిల్స్ ఫార్మాట్ లో పోటీపడబోతున్నాడు.ఆలస్యమైనప్పటికీ, సైనా మరియు సింధూ లాగానే, శ్రీకాంత్ యొక్క ఫామ్ ప్రశ్నార్ధకంగానే ఉంది. ఆశించదగ్గ రీతిలో లేని అతని పనితీరు, ప్రత్యేకించి ఇటీవలనే ముగిసిన ఆసియా బ్యాడ్‌మింటన్ ఛాంపియన్‌షిప్స్ లో అతడి పనితీరు ఆందోళనలు రేకెత్తించింది. అయినప్పటికీ, సుదీర్మన్ కప్ లో ఈ గుంటూరు యువకుడి బలమైన పనితీరు అతని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నింపుకోవడానికి పని చేయగలదని ఆకాంక్ష. హైదరాబాద్ కు చెందిన సమీర్ వర్మ కూడా సింగిల్స్ లో పోటీపడబోతున్నాడు మరియు అతడు కూడా తన మార్కు ప్రదర్శించగలడని ఆశించబడుతోంది.

గడచిన సంవత్సరం సుదీర్ఘ కాలం భుజం గాయాలతో బాధపడిన యువకుడు స్వస్తిక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ షెట్టితో పాటుగా ఆడుతూ పురుషుల డబుల్స్ పోటీలో తిరిగి ప్రవేశించబోతున్నాడు. ఏప్రిల్ లో జరిగిన ఆసియా బ్యాడ్‌మింటన్ ఛాంపియన్‌షిప్ లో తప్పిన ఈ జంట తిరిగి గాడిలో పడేందుకు గాను, ఈ టోర్నమెంటు వారికి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతోంది.

ఫేవరైట్లయిన చైనా మరియు మలేషియాలతో పాటుగా ఇండియా గ్రూపు ‘డి’ లో చేర్చబడింది. 2017 ఎడిషన్ లో, క్వార్టర్ ఫైనల్స్ లో ఇండియా తలవంచింది. ఒక్కొక్క గ్రూపు నుండి రెండు అగ్ర జట్లు నాకౌట్ దశలకు అర్హత పొందుతాయి. మలేషియాపై ఇండియా యొక్క ఇటీవలి రికార్డు చూడ చక్కగానే కనిపిస్తోంది, ప్రత్యేకించి గత సంవత్సరం కామన్‌వెల్త్ క్రీడలలో వారి విజయం తర్వాత అది ప్రస్ఫుటంగా ఉంది.ఏది ఏమైనప్పటికీ, చైనాను ఎదుర్కొని అధిగమించడం అనేది మొత్తమ్మీద ఒక విభిన్నమైన కార్యం అవుతుంది.

టోర్నమెంటు దిశగా ముందుకు వెళుతూ, ఇండియా, కాగితంపై ఒక బలీయమైన శక్తిలా అగుపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఇటీవలి స్థిరత్వం నుండి బయటపడి దేశం కోసం రంగంలోనికి అడుగుపెట్టే జవాబుదారీ మాత్రం ఆటగాళ్ళపైనే ఉంటుంది.

రచయిత గురుంచి


వ్రాసిన వారు Website Admin

×
Embed Code